YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఓటర్లు బాధ పడుతున్నారు

ఓటర్లు బాధ పడుతున్నారు

ఓటర్లు బాధ పడుతున్నారు
కడప ఫిబ్రవరి 19
వైసీపీ అధికారంలోకి వస్తే వైఎస్  జగన్‌ మంచి పాలన అందిస్తారని ప్రజలు భావించారని, కానీ ప్రస్తుత పాలన చూస్తే ఇలాంటి వారికా తాము ఓట్లు చేసిందని బాధపడేలా పరిస్దితి ఉందని   బీజేపీ రాష్ట అద్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. కడపలొ బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసి,  అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసనగా చేపట్టిన కార్యక్రమంలొ అయన పాల్గొన్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  అధికారం చేపట్టిన తర్వాత జగన్ ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారని, రాక్షస పాలనను ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీని ఎద్దేవా చేసిన మీరు ఇప్పుడు చేస్తున్నదేంటని కన్నా ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలంతా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. బాబు ఫంథాలోనే పోలీసులను అడ్డంగా పెట్టుకోని పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం తగదని, పిజేపి నాయకులు బండిప్రభాకర్ అనుచరులపై వైసీపీ అల్లరి మూకలు దాడికి పాల్పడిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులను కలిసి విన్నవించినా ఫలితం లేదన్నారు. స్థానిక సంస్థల్లో గెలవడం కోసం పథకాల్లో కోత పెడతామంటూ ప్రజలను వైసీపీ నేతలు భయపెడుతున్నారన్నారు. ఎన్ఆర్సీ పై అవగాహన లేని డిప్యూటీ సీఎం మత విద్వేశాలను సృష్టించడం తగదని,అసత్యపు ప్రచారం, అవగాహన లేని వారు పాలకులుగా అనర్హులని ధ్వజమెత్తారు. బిజేపిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక... ప్రతిపక్షాలు నక్క జిత్తుల వ్యవహారాలు చేస్తున్నాయని కన్నా విమర్శించారు.

Related Posts