YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

సీబీఐకి బాలిక కేసు

సీబీఐకి బాలిక కేసు

సీబీఐకి బాలిక కేసు
విజయవాడ, ఫిబ్రవరి 19 
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కర్నూలు బాలిక కేసు‌ సంగతి తెలిసిందే. ఈ కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ చాలా రోజులుగా వినిపిస్తోంది. కర్నూలు జిల్లా ఎస్పీ కూడా ఇదే విషయంపై స్పందించారు.. సీబీఐకి అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. తాజాగా బాధితురాలి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి న్యాయం చేయాలని కోరారు.సీఎం జగన్ కర్నూలు పర్యటనకు వచ్చిన సందర్భంలో ప్రీతి కుటుంబ సభ్యులు కలిసారు. బాలిక తల్లి తన బాధను ముఖ్యమంత్రికి చెప్పుకుంది. ఈ కేసును సీబీఐకి రిఫర్ చేస్తున్నామని.. తప్పకుండా న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. బాలిక కుటుంబానికి అండగా ఉంటామని.. వారిని ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. బాలిక కుటుంబం మరోసారి తనను కలవాలని.. అప్పుడు అన్ని విషయాలపై చర్చిస్తానన్నారు. వారిని తన దగ్గరకు తీసుకురావాలని అధికారుల్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇవ్వడంతో ఆమె కుటుంబం కూడా తమకు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఉంది.

Related Posts