YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష

రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష

రాష్ట్రానికి టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష-మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టిఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.బుధవారం ఆయన స్థానిక  అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా,జిల్లా పరిషత్ చైర్మన్ విఠల్ రావు,నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ ఇతర నాయకులతో కలిసి నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం నిజామాబాద్ లో నిర్మిస్తున్న టిఆర్ఎస్ పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయం పనులు పరిశీలించామన్నారు. పనులు పూర్తి కావచ్చాయని 15రోజుల్లో జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకొనున్నామని ఆయన తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయాలు నిర్మాణం చేపట్టామని,పార్టీ కార్యవర్గం ఇక్కడ ప్రజల్ని కలుస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం పై మాట్లాడుకునే విధంగా కార్యాలయాలు రూపుదిద్దుకుంటున్నట్లు తెలిపారు.పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు టిఆర్ఎస్ పార్టీనే భరోసా కాబట్టి వారి సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కార్యాలయాలు ఉపయోగపడుతాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించుకుంటున్న జిల్లా కార్యాలయాల్లో పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించుకోవడానికి వీలుగా 500 మంది పట్టే విధంగా పెద్ద మీటింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లే విధంగా ఇక్కడ కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని ఆయన అన్నారు.సాధారణ స్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు పార్టీ పరంగా ప్రజా సంక్షేమం,అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలను ప్రభుత్వానికి చెప్పే విధంగా ఉండాలనే పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు పనిచేయనున్నాయన్నారు.తెలంగాణ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు ఆకలింపు చేసుకుని ఏయే వర్గాలకు ఏం చేస్తే బాగుంటుందనే చర్చలు జరిపి ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే విధంగా ఇక్కడ పార్టీ శ్రేణులు మీటింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన పర్యవేక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్ర పార్టీ కార్యాలయాలు నిర్మించుకుంటునట్లు తెలిపారు.నిజామాబాద్ జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయం నిర్మాణ పనులు అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఆధ్వర్యంలో నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయన్నారు.

Related Posts