YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

.రాజధాని రైతులపై కక్షగట్టిన ప్రభుత్వం

.రాజధాని రైతులపై కక్షగట్టిన ప్రభుత్వం

.రాజధాని రైతులపై కక్షగట్టిన ప్రభుత్వం : నక్కా ఆనందబాబు
గుంటూరు, ఫిబ్రవరి 20, 
అమరావతికి మద్దతుగా గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట రిలే దీక్షలు చేపట్టిన రైతులకు టీడీపీ నేతలు మాకినేని పెద రత్తయ్య, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ అమరావతి ఉద్యమకారులపై అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాజధాని రైతులపై ప్రభుత్వం కక్షగట్టిందన్నారు. రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో పక్క మండలం తహసీల్దార్‌ను రాజధానికి పంపారని ఆరోపించారు. సర్వేను ప్రశ్నిస్తే 426 మందిపై అక్రమ కేసులుపెట్టారని మండిపడ్డారు. మీడియాపై కూడా కేసులు పెడుతున్నారన్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం ఆయా గ్రామాల్లోనే స్థలాలు సేకరించాలని నక్కా ఆనందబాబు సూచించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మడం లేదని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

Related Posts