YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పోలీసు వ్యవస్థను నాశనం చేసిన అధికార పార్టీ : కన్నా

పోలీసు వ్యవస్థను నాశనం చేసిన అధికార పార్టీ : కన్నా

పోలీసు వ్యవస్థను నాశనం చేసిన అధికార పార్టీ : కన్నా
విజయవాడ, ఫిబ్రవరి 20, 
జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. గురువారం విజయవాడలో జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశంలో కన్నా మాట్లాడుతూ గిరిజనుడిపై అట్రాసిటీ కేసులు పెడుతున్నారన్నారు. డీజీపీని కలిసినా కేసులు ఆగడం లేదని...ప్రభుత్వ అండతోనే దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.  హిందూ దేవాలయాలపై దాడులకు ప్రభుత్వం అండ ఉందని కన్నా ఆరోపించారు.జనసేనతో కలిసి స్థానిక సంస్థలు ఎన్నికలు ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు తెలిపారు. జనసేనతో పొత్త పెట్టుకుని పేదలకు అండగా, బలమైన శక్తిగా ఎదుగుతామని కన్నా చెప్పారు. దేశంలోని ప్రతిపక్షాలవి నక్క జిత్తుల చర్యలని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక హిందూ సంస్కృతి నాశనమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఆలయాలను ఉద్దేశపూర్వకంగా కూలగొడుతున్నారని విమర్శించారు. టీడీపీ, వైసీపీ.. రాజకీయ పార్టీలు కాదని..కార్పొరేట్ కంపెనీలు అని వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థను నాశనం చేసి అధికార పార్టీ తొత్తులుగా చేసుకున్నారని కన్నాలక్ష్మీనారాయణ ఆరోపించారు. 

Related Posts