YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది: శశిథరూర్

కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది: శశిథరూర్

కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది: శశిథరూర్
న్యూఢిల్లీ ఫిబ్రవరి 20
కాంగ్రెస్ అధిష్ఠాన వ్యవహార శైలిపై ఒక్కొక్కరుగా తన అసంతృప్తిని బాహాట పరుస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ తన అసంతృప్తిని వ్యక్తం చేయగా... తాజాగా తిరువనంతపురం పార్లమెంట్ సభ్యుడు శశిథరూర్ ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ ట్వీట్ చేయడం విశేషం. పార్టీలో నాయకత్వ ఎన్నికలు నిర్వహించి, పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం తీసుకురావాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉందని, వెంటనే నాయకత్వ ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ సూచించింది నూటికి నూరు పాళ్లూ నిజమేనని, చాలా మంది  కార్యకర్తల్లో ఇదే అభిప్రాయముందని థరూర్ ట్వీట్ చేశారు. కార్యకర్తల్లో నూతనోత్సాహం కోసం వెంటనే ఎన్నికలు నిర్వహించి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని థరూర్ సూచించారు. ఇంతకు ముందు మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ మాట్లాడుతూ... రాజ్యసభలో ఉన్న సీనియర్లు, మాజీ ముఖ్యమంత్రులు, ప్రస్తుత ఖ్యమంత్రులు అందరూ ఒకే తాటిపైకి వచ్చి పార్టీకి పునరుజ్జీవం పోయాల్సిన సమయం ఆసన్నమైందని దీక్షిత్ అభిప్రాయపడ్డారు. 

Related Posts