YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

 ఎమ్మెల్యే సోదరి కేసులో పోలీసుల విచారణ పూర్తి

 ఎమ్మెల్యే సోదరి కేసులో పోలీసుల విచారణ పూర్తి

 ఎమ్మెల్యే సోదరి కేసులో పోలీసుల విచారణ పూర్తి
కరీంనగర్ ఫిబ్రవరి 20  
ఎమ్మెల్యే సోదరి రాధిక కుటుంబం కేసులో పోలీసుల విచారణ పూర్తి అయింది. కాకతీయ కెనాల్‌లో ప్రమాదవశాత్తే కారు పడినట్లు పోలీసులు తేల్చారు. రాధిక కుటుంబం ఆత్మహత్య చేసుకుందని వస్తున్న కథనాలు అవాస్తవాలని, అన్ని కోణాల్లో ఈ కేసు విచారణ చేశామని పోలీసులు తెలిపారు.కరీంనగర్‌ జిల్లా యాదాలపల్లి సమీపంలో ఎల్‌ఎండీ కాకతీయ కాలువలో లభ్యమైన కారు 16 రోజుల క్రితం కాలువలో పడిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెల్లెలు రాధ, ఆమె భర్త లక్ష్మీపూర్‌కు చెందిన సత్యనారాయణరెడ్డిగా గుర్తించారు. వీరు రెండు వారాల క్రితం తమ కూతురితో కలిసి వెళుతుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. తర్వాత నలుగురు కనిపించకుండా పోవడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ నలుగురు ప్రయాణిస్తున్న కారు అదే రోజు ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు

Related Posts