YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 రైతులకు  అమరావతి పోలీసులు షాక్  

 రైతులకు  అమరావతి పోలీసులు షాక్  

 రైతులకు  అమరావతి పోలీసులు షాక్  
విజయవాడ, ఫిబ్రవరి 20 
అమరావతి రైతులకు పోలీసులు షాకిచ్చారు. కృష్ణాయపాలెం రైతులపై కేసులు నమోదు చేశారు. బుధవారం తహశీల్దార్ వాహనాన్ని ఆపిన ఘటనలో.. మంగళగిరి రూరల్ పోలీస్‍స్టేషన్‍లో 7 సెక్షన్ల కింద 426 మందిపై కేసు నమోదయ్యాయి. ఎమ్మార్వోవాహనాన్ని అడ్డుకోవడం, పబ్లిక్ న్యూసెన్స్ సహా 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రైతులపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.రైతులపై కేసు నమోదు చేయడాన్ని జనసేన పార్టీ మండిపడింది. రాజధాని గ్రామం కృష్ణాయపాలెంలో రెవెన్యూ అధికారుల ముందు నిరసన తెలిపిన రైతులపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వెల్లడిస్తోందని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాలకు చెందిన 426 మందిపై కేసులుపెట్టి రైతాంగాన్ని భయభ్రాంతులకు గురిచేయాలని ప్రభుత్వం భావిస్తోందని.. ప్రభుత్వం తక్షణమే ఈ కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు.రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములను.. ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించకూడదనే ఉద్దేశంతోనే ఆ రైతులు నిరసన తెలిపారని గుర్తు చేశారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పటి నుంచి రైతుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని.. ఇలాంటి తరుణంలో కేసులుపెట్టడం పుండు మీద కారం చల్లినట్లుగా ఉందన్నారు. తొలి రోజు నుంచీ రైతులు శాంతియుతంగా తమ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. ప్రభుత్వం రైతులతో చర్చించకుండా కేసులుపెట్టడం అప్రజాస్వామికమని.. రాజధాని కోసం పోరాడుతున్నవారికి జనసేన బాసటగా నిలుస్తామన్నారు.అమరావతి రాజధానిలోని భూములను పేదల ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం రెండు వేల నుండి నాలుగు వేల ఎకరాల భూమిని సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతంలోని శాఖమూరు, పెనుమాక, కృష్ణాయపాలెంతో పాటు మరి కొన్ని ప్రాంతాలలో పేదవారి ఇంటి స్థలాల కోసం భూమిని రెవిన్యూ శాఖ గుర్తించింది.. ఆ భూముల్ని పరిశీలించేందుకు వచ్చిన కృష్ణాయపాలెం వచ్చిన తహశీల్దార్ వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు.

Related Posts