YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం దేశీయం

శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం

శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం

శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం
పంచారామ క్షేత్రాల్లో ఒకటైన క్షీరారామం.. ఆంధ్రప్రదేశ్ లోని పాలకొల్లులో వెలిసింది. సాక్షాత్తు శ్రీరాముడు సీతమ్మవారితో కలిసి ప్రతిష్టించిన ప్రసిద్ధ శివలింగమే పాలకొల్లులో శ్రీరామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు.పాలకొల్లులో కొలువైన క్షీరరామలింగేశ్వరస్వామి ఆలయాన్ని చాళక్యుల కాలంలో నిర్మాణం చేసిన ప్రతీది అద్భుతంగానే కనిపిస్తుంది... పాలకొల్లులో శ్రీరాముడు సీతమ్మ వార్ల స్వహస్తాలతో శివలింగాన్ని ప్రతిష్టించారని విశ్వాసం. పంచారామ క్షేత్రాలలో ఒకటైన క్షీరారామం పార్వతీ సమేతుడై 'శ్రీ రామలింగేశ్వరుడు' వెలసిన పరమ పావనమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి శివలింగం చిక్కని పాలవలే తెల్లగా మెరుస్తూ భక్తులకు కనువిందు చేస్తుంటుంది. శ్రీ మహావిష్ణువుచే శివలింగం ప్రతిష్ఠించబడిన ఈ పుణ్య క్షేత్రానికి విష్ణుమూర్తే క్షేత్రపాలకుడు. ఆదిశంకరాచార్యులవారు ఈ క్షేత్రాన్ని దర్శించి శ్రీ చక్రం ప్రతిష్ఠించారు పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలకుడి కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యుపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థలపురాణం చెబుతోంది. శివలింగం పైభాగం మొనదేలి ఉండటం వలన ఇక్కడి స్వామివారిని 'కొప్పు రామలింగేశ్వరుడు' అని కూడా పిలుస్తారు. ఇది కుమారస్వామి ఛేదించిన ఆత్మలింగపు పైభాగమని విశ్వాసం. స్వామివారికి ఎదురుగా ఉన్న ప్రాకార మంటపంలో పార్వతీ దేవి కొలువై వుంటుంది. ఈ ఆలయంలో పరమశివునితో పార్వతిదేవి పూజలందుకుంటుంది. ఆ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ... రుణహర గణపతి ఆలయాలు కనిపిస్తాయి. ఈ రుణహర గణపతిని దర్శించడం వలన అప్పుల బాధల నుంచి బయటపడటం జరుగుతుందని భక్తులు భావిస్తుంటారు. శ్రీరామలింగేశ్వర మందిరం చాలా ఎత్తైంది. చోళ రాజుల శిల్పకళా రీతులను అద్భుతంగా చూపించే  గోపురాలలో ఇది ఒకటి.చాళుక్యుల కాలంలో, 10 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ గుడి గోపురం 9 అంతస్తులతో 125 అడుగుల ఎత్తుతో కనిపిస్తుంది. తొమ్మిది అంతస్థులుగా నిర్మించిన ఆలయంలో  గాలిగోపురం ప్రత్యేక ఆకర్షణ. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పుణ్యక్షేత్రాల్లో ఉన్న ప్రధాన గాలి గోపురాల్లోకెల్లా ఇది ఎత్తైనదిగా చెబుతుంటారు. ఆలయానికి  దూరంలో కనిపించే చెరువుకు ఎంతో కధ ఉంది. గోపుర నిర్మాణసమయంలో ఒక్కొక్క అంతస్తు నిర్మిస్తూ... తరువాత దాని చుట్టూ మట్టినిపోస్తూ దానిపై రాకపోకలతో రెండవ అంతస్తు నిర్మాణం చేసేవారట ఆవిధంగా మట్టి తీయగా చెరువు తవ్వారని చెబుతారు.  చెరువును  రామగుండం అని పిలుస్తున్నారు ఈ పుణ్య క్షేత్రానికి దశలవారీగా అభివృద్ధి పనులు జరిగాయనడానికి చాళుక్యులు ... రెడ్డి రాజులు ... కాకతీయులు వేసిన శాసనాలు ఆధారాలుగా కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ పర్వ దినాల సమయంలో విశేషమైన పూజలు, ఉత్సవాలు వైభవంగా జరుగుతుంటాయి. వీటిని తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చి స్వామివారినీ, అమ్మవారిని దర్శించుకుంటారు. వెలనాటి చోళరాజు భార్య గుండాంబిక క్రీ.శ.1157లో పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి అఖండదీపానికి దానం ఇచ్చింది. ఇక్కడి నాట్యమంటపానికి క్రీ.శ. 1276లో కోన గణపతిదేవ మహారాజు కంచు తలుపులు పెట్టించారు. 150 అడుగుల ఎత్తైన ఆలయ గోపురాన్ని క్రీ.శ.1415న అల్లాడ రెడ్డిభూపాలుడు నిర్మించారని శిలాశాసనం పేర్కొంటోంది. చెళ్ళపిన్నమనేని నరహరినేని ఆలయ కళ్యాణమండపం నిర్మించారు. క్రీ.శ.1777లో బచ్చు అమ్మయ్య మూడు వందల సంవత్సరాల నాడు ప్రారంభించిన గోపురాన్ని పూర్తిచేయించారు.
 

Related Posts