YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ 8 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ 8 మంది మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ 8 మంది మావోయిస్టులు మృతి
ఖమ్మం ఫిబ్రవరి 22
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.   సుక్మా జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా  ఆపరేషన్‌ ప్రహార్‌ చేపట్టారు. ఆపరేషన్‌లో  సుమారు 1500 మంది డీఆర్జీ బలగాలు, 500 మంది కోబ్రా బెటాలియన్‌ జవాన్లు పాల్గొన్నారు.   బడేకదేవాల్‌ అటవీ ప్రాంతంలో 30 గంటల పాటు ఆపరేషన్‌ ప్రహార్‌ కొనసాగింది.  కసాల్పవాడ్‌ అటవీ ప్రాంతంలో భీకరమైన ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనాస్థలంలో  మావోయిస్టులకు చెందిన భారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్‌ ప్రహార్‌లో భాగంగా భద్రతా బలగాలు బృందాలుగా దండకారణ్యంలో సుమారు 30 కిలోమీటర్ల వరకు చొచ్చుకుపోయి సెర్చ్‌ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిసింది.

Related Posts