YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 కర్ణాటక ఎమ్మెల్యేల నివాస సముదాయాల్లో మీడియాపై నిషేధం

 కర్ణాటక ఎమ్మెల్యేల నివాస సముదాయాల్లో మీడియాపై నిషేధం

 కర్ణాటక ఎమ్మెల్యేల నివాస సముదాయాల్లో మీడియాపై నిషేధం
బెంగళూరు ఫిబ్రవరి 22
కర్ణాటక ఎమ్మెల్యేల నివాస సముదాయాల్లో మీడియాపై నిషేధం విధించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ విశ్వేశ్వరయ్య హెగ్డే నోటీసులు జారీ చేశారు. ఎలక్ట్రానిక్‌ మరియు ప్రింట్‌ మీడియాతో పాటు కెమెరామెన్లకు ఏ సమయంలో కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోకి అనుమతించమని స్పీకర్‌ కార్యాలయం వెల్లడించింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు.. తమ తమ నియోజకవర్గాల నుంచి శాసనసభకు వస్తారు. ఈ సమావేశాలకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలకు కేటాయించిన నివాస సముదాయాలకు వెళ్లడం జరుగుతుంది. ఈ సమయం ఎమ్మెల్యేలకు పూర్తిగా ప్రయివేటు సమయం.. కాబట్టి వారి నివాస సముదాయాల్లోకి వెళ్లడం సరికాదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలతో మాట్లాడేందుకు గృహ సముదాయం గేటు బయట జర్నలిస్టులకు ఏర్పాట్లు చేశామని స్పీకర్‌ కార్యాలయం తెలిపింది.

Related Posts