అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్లో ట్రంప్ ఫ్యామిలీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన స్వాగతం
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండ్రోజుల భారత పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. ఆయన వెంట భార్య మెలానియా, కుమార్తె ఇవాంక, అల్లుడు జేర్డ్ కుష్నర్, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ఫోర్స్ వన్ విమానం 11.45 గం.లకు చేరుకుంది. ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ట్రంప్ను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు ప్రధాని మోదీ.