డ్యాన్సులతో అదరగొట్టిన ఎమ్మెల్యే
విజయవాడ, ఫిబ్రవరి 24
కృష్ణా జిల్లా మైలవరం మండలం వేల్వడం గ్రామంలో ప్రభల గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో కృష్ణా జిల్లాకు చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ డ్యాన్స్ చేసి అలరించారు.ఎన్నారై లక్కిరెడ్డి జయప్రకాశ్రెడ్డితో కలిసి కృష్ణప్రసాద్ స్టెప్పులతో అదరగొట్టారు. ఎమ్మెల్యే డ్యాన్స్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే శివరాత్రి పర్వదినం సందర్భంగా యార్లగడ్డ గ్రాండర్ నుంచి ప్రభ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఇందులో వైసీపీ ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ గారు, విజయవాడ టౌన్ పార్టీ అధ్యక్షుడు బొప్పనభవ కుమార్, ఉప్పాల రాంప్రసాద్, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, గన్నవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.