పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ
నెల్లూరు ఫిబ్రవరి 24
ఎన్ ఆర్ సి, సి ఏ ఏ, ఎన్ పి ఆర్ పౌరసత్వ బిల్లు కు వ్యతిరేకంగా నగరంలోని స్థానిక పెద్ద బజార్ , చేపల మార్కెట్ వద్ద ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు భారీ బహిరంగ సభ
నిర్వహిస్తున్నట్లు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు ఎస్ కె అల్లాఉద్దీన్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సాకే శైలజానాథ్ , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి, తులసిరెడ్డి పాల్గొంటారని తెలిపారు. కేవలం ముస్లింలకే కాకుండా హిందూ, క్రిస్టియన్ తదితరులు అందరికీ కూడా పౌరసత్వ బిల్లు వ్యతిరేకంగా ఉందన్నారు. పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ నిర్వహించు భారీ బహిరంగ సభలో కులమతాలకతీతంగా జిల్లా వాసులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు