YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రజా వేదిక వేలానికి సిద్ధం

ప్రజా వేదిక వేలానికి సిద్ధం

ప్రజా వేదిక వేలానికి సిద్ధం
విజయవాడ, ఫిబ్రవరి 25,
రాజధాని అమరావతి ప్రాంతంలో 9 నెలల క్రితం కూల్చివేసిన ప్రజావేదిక పరికరాలను వేలం వేయాలని ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి సిద్ధమైంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి ప్రభుత్వ సమావేశాన్ని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఇంటి పక్కనే ఉన్న ప్రజా వేదికలో ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా అక్రమ కట్టడంలో మనం సమావేశమయ్యామని, ఇలాంటి వాటిని తమ ప్రభుత్వం సహించబోదని సీఎం జగన్ అన్నారు. ఈ అక్రమ కట్టడాన్ని వెంటనే కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. మరుసటి రోజే సీఆర్డీఏ అధికారులు ప్రజావేదికను కూల్చివేశారు. అప్పటి నుంచి ప్రజా వేదికలోని ఏసీలు, పలు పరికరాలను అలాగే ఉంచేశారు. అయితే, ఇప్పుడు ఆ పరికరాలను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ఉంచారు.దీని కోసం.. మార్చి 3వ తేదీ లోపు వేలం పత్రాలను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సీఆర్డీఏ సూచించింది. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఈ- వేలం ప్రారంభం అవుతుందని పేర్కొంది.

Related Posts