YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 ఏప్రిల్ ఫస్ట్ నుంచి యూరో 6  గ్రేడ్ పెట్రోల్

 ఏప్రిల్ ఫస్ట్ నుంచి యూరో 6  గ్రేడ్ పెట్రోల్

 ఏప్రిల్ ఫస్ట్ నుంచి యూరో 6  గ్రేడ్ పెట్రోల్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25, 
ఏప్రిల్ 1 నుంచి అత్యంత శుద్ధి ఇంధనం భారత్‌లో వినియోగంలోకి రానుంది. దీంతో కాలుష్య ఉద్గారాలను గణనీయంగా తగ్గించే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే క్లీనెస్ట్ పెట్రోల్, డీజిల్‌గా పేరున్న యూరో-6 గ్రేడ్ ఇంధనాన్ని మోదీ సర్కార్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. తద్వారా ఈ ఇంధనం వినియోగిస్తున్న అతికొద్ది దేశాల సరసన భారత్ చేరనుంది. అంతేకాకుండా.. యూరో-6 గ్రేడ్ ఇంధనానికి అప్‌గ్రేడ్ కావడానికి అనేక దేశాలు అపసోపాలు పడుతుండగా.. భారత్ లాంటి పెద్ద దేశంలో కేవలం మూడేళ్లలోనే ఈ ఘనత సాధిస్తుండటం విశేషం.యూరో-6 గ్రేడ్ ఇంధనం అత్యంత శుద్ధి చేసింది. దీని ద్వారా కాలుష్య ఉద్గారాలు భారీగా తగ్గిపోతాయి. ముఖ్యంగా.. ప్రమాదకరమైన సల్ఫర్ ఉద్గారాలు 10 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియమ్)కు తగ్గనుండటం విశేషం. ఈ కారణంగానే ఈ ఇంధన వినియోగాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వాస్తవానికి కాలుష్య నియంత్రణపై అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఇది ఎప్పుడో అమలు చేయాల్సి ఉంది.భారత్‌లో ప్రస్తుతం యూరో-4 ఇంధనం వినియోగంలో ఉంది. యూరో-4 నుంచి యూరో-5 అవసరం లేకుండానే భారత్ నేరుగా యూరో-6కి అప్‌గ్రేడ్ అవుతుండటం మరో విశేషం. అది కూడా ప్రపంచంలోని మిగతా దేశాలకు సాధ్యపడని రీతిలో కేవలం 3 ఏళ్ల కాలంలోనే ఇండియా ఈ ఘనత వహిస్తోంది. యూరో-6ను భారత్ బీఎస్-6గా వ్యవహరిస్తోంది.దేశంలో అత్యాధునిక మోడళ్ల కార్లు, బైకుల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కాలుష్య నియంత్రణ అంశంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన వాహనాల వినియోగం పెరిగింది. కానీ, వాటిని నడపడానికి వాడే పెట్రోల్, డీజిల్ గ్రేడు మాత్రం అప్‌డేట్ కాలేదు. బీఎస్-6 వాహనాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ నేటికీ బీఎస్-4 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నాం. దీంతో కాలుష్య ఉద్గారాలను అనుకున్న స్థాయిలో నియంత్రించలేకపోతున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. దేశంలోని మెట్రో నగరాలన్నీ భవిష్యత్తులో ఇదే పరిస్థితిని ఎదుర్కొనే ప్రమాదంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీఎస్-6 ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.దేశంలోని అన్ని రిఫైనరీలు 2019 చివరి నాటికే యూరో-6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిని ప్రారంభించాయని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రతి ఇంధనం చుక్కను యూరో-6 గ్రేడ్‌గా మార్చబోతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే అన్ని రిఫైనరీలు బీఎస్-6 ఇంధన సరఫరాను మొదలుపెట్టాయని.. దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యూయల్ స్టోరేజ్ డిపోలకు ఈ ఇంధనం చేరుతోందని తెలిపారు.ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న ఇంధనంతో పోలిస్తే.. యూరో-6 ఇంధనం ఉత్పత్తికయ్యే ఖర్చు కాస్త ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లీటరు పెట్రోలుపై ఒక రూపాయి వరకు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధనం ధరలతో పోలిస్తే, దేశంలో ఇప్పటికే పెట్రోలు, డీజిల్ రేట్లు అధికంగా ఉన్నాయని.. మోదీ ప్రభుత్వం ధరలు పెంచే సాహసం చేయకపోవచ్చని మరికొందరి వాదన.

Related Posts