జిగేల్ మంటున్న బంగారం ధరలు
ముంబై, ఫిబ్రవరి 25,
పసడి ధర ధగధగలాడుతోంది. బంగారం ధర మళ్లీ జిగేల్మంది. ఈ రోజు కూడా పైపైకి కదిలింది. అప్ట్రెండ్లోనే కొనసాగింది. భారీగా ర్యాలీ చేస్తూ కొండెక్కి కూర్కొంది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి చుక్కలు కనిపిస్తున్నాయి. పసిడి ప్రేమికులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంగారం ధర భగభగమంటూ మెరిసిపోతుంటే.. వెండి ధర కూడా ఇదే దారిలో పరుగులు పెట్టింది.పసిడి ధర పెరుగుదలకు కరోనా వైరస్ ముఖ్య కారణం. ఇది ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం గట్టి పడొచ్చనే ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో సురక్షిత ఇన్వెస్ట్మెంట్ సాధనంగా భావించే బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పసిడి ధర గ్లోబల్ మార్కెట్లో ర్యాలీ చేస్తోంది. దీంతో భారత్లో కూడా పసిడి పరుగులు పెడుతోంది. అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం కూడా బంగారానికి కలిసొచ్చింది.హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 పెరుగదలతో రూ.44,430 నుంచి రూ.44,700కు చేరింది. బంగారం ధర రూ.45 వేల మార్క్కు ఇంకొంచెం దూరంలోనే ఉంది.అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా ర్యాలీ చేసింది. ఇది కూడా రూ.270 పెరిగింది. దీంతో ధర రూ.40,730 నుంచి రూ.41,000కు చేరింది. బంగారం ధర పెరుగుతూ రావడం ఇది వరుసగా ఆరో రోజు కావడం గమనార్హం.బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడుస్తోంది. వెండి ధర రూ.500 పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర రూ.51,000 నుంచి రూ.51,500కు ఎగసింది. అంటే కేజీ వెండి ధర అర లక్షను దాటేసిందన్నమాట. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర 7 ఏళ్ల గరిష్ట చేరింది. పసిడి ధర ఔన్స్కు 1.74 శాతం పెరుగుదలతో 1678.4 డాలర్లకు చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.98 శాతం పెరుగుదలతో 18.71 డాలర్లకు చేరింది.బంగారం ధర రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్ సహా పలు అంతర్జాతీయ పరిస్థితులు పసిడి పరుగుకు దోహదపడతాయని తెలిపారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీన పడితే.. ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని పేర్కొన్నారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000 మార్క్కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారుఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.270 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.41,000కు చేరింది. వెండి ధర రూ.51,500కు పరుగులు పెట్టింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్లో పసిడి ధర రూ.240 పైకి కదిలింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,850కు చేరింది.