YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

దిశ చట్టంపై దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి

దిశ చట్టంపై దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి

దిశ చట్టంపై దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి
అమరావతి ఫిబ్రవరి 25
;ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం గా రూపొందించి అమలు చేస్తున్న దిశ చట్టంపై దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం దృష్టి సారించాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం మహిళలపై అత్యాచారాలను నిరోధించే క్రమంలో భాగంగా ఏపీ దిశా చట్టాన్ని తమ రాష్ట్రంలో ప్రవేశపెట్టేందుకు అధ్యయనం చేస్తోంది. ఏపి ప్రభుత్వం అత్యాచార కేసుల్లో నిందితులకు మరణ శిక్ష పడేలా చేయడంతో పాటు 21 రోజుల్లోనే తీర్పు వెలువడేలా దిశ చట్టాన్ని రూపొందించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో కూడా దిశ యాక్ట్ని తీసుకొచ్చే విధంగా.. ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే దృష్టి సారించారు. ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని కూడా నియమించారు. మార్చి 30వ తేదీ లోపు నివేదిక అందజేయాలని సీఎం వారిని ఆదేశించినట్టు హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్తెలిపారు. దిశ చట్టం గురించి తెలుసుకునేందుకు తాము ఏపీలో పర్యటించామని తెలిపారు. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చిన దిశ చట్టాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని దేశ్ ముఖ్ గతంలోనే తెలిపారు. దిశ చట్టాన్ని.. మహిళలు పిల్లలపై అత్యాచారాలకు సంబంధించిన కేసులను వేగంగా
పరిష్కరించడానికి కొన్ని సందర్భాల్లో మరణశిక్ష పడే విధంగా రూపొందించినట్టు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే దిశ చట్టంపై ఢిల్లీ ఒడిశా ప్రభుత్వాలు కూడా ఇంతకుముందు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఏపీ సర్కారు అమలు చేస్తున్న దిశ చట్టం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిని ఆకర్షిస్తోంది.

Related Posts