రాజ్ఘాట్ను మొక్క నాటిన ట్రంప్ దంపతులు
న్యూఢిల్లీ ఫిబ్రవరి 25
రెండోరోజు భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ ఇవాళ ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించారు. జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బాపూ గౌరవార్థం ట్రంప్ దంపతులు రాజ్ఘాట్ ఆవరణలో ఓ మొక్క నాటారు. ఇద్దరూ పొడవాటి పారలతో మొక్కనాటి, మట్టివేస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్లో ట్రంప్ ఓ సందేశాన్ని రాస్తూ... ‘‘మహాత్ముడి ఆకాంక్షల మేరకు నిర్మితమైన సార్వభౌమ, అద్భుతమైన భారత్కు అమెరికా ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటారు..’’ అని పేర్కొన్నారు. కాగా అంతకు ముందు ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది.