YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

ఢిల్లీలో అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమీక్ష

ఢిల్లీలో అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమీక్ష

ఢిల్లీలో అల్లర్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమీక్ష
న్యూఢిల్లీ ఫిబ్రవరి 25
ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి ఘటనలపై కేంద్రం దృష్టి పెట్టింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఢిల్లీ అధికారులతో చర్చించారు. ఢిల్లీలో ఘర్షణలపై అమిత్ షా సమీక్ష జరిపారు. మరోవైపు ఈశాన్య ఢిల్లీని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీఎం కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి పునరుద్ధరణ కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపు ఇచ్చారు. సయంమనంతో ఉండాలని ప్రజలను కోరారు. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈశాన్య ఢిల్లీలో శాంతిభద్రతలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు. శాంతి సామరస్యతను కాపాడేందుకు సయంమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ నేపథ్యంలో నిరసనలు తలెత్తిన ప్రాంతంలో చర్యలు తీసుకువడంపై అమిత్‌ షా సానుకూలంగా స్పందించినట్లు కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. నిరసన జరిగిన ప్రాంతానికి పోలీసులను పంపనున్నట్లు  అమిత్‌ షా హామీ ఇచ్చారని కేజ్రీవాల్‌ వెల్లడించారు. దీంతో పాటు ఈశాన్య ఢిల్లీలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని పార్టీలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయని కేజ్రీవాల్‌ తెలిపారు. అంతకుముందు ఈశాన్య ఢిల్లీ ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత కేజ్రీవాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లలో మృతుల సంఖ్య ఏడుకు చేరడం బాధాకరమని పేర్కొన్నారు. నిరసనల్లో భాగంగా పలు ఇళ్లకు, దుకాణాలకు నిప్పు పెట్టి ఆస్తి నష్టం కలిగించడం దురదృష్టకరమని తెలిపారు. ఢిల్లీలో పోలీసుల కొరత తీవ్రంగా ఉందని, పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతంలో చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.దాడిలో చనిపోయిన కానిస్టేబుల్‌తో పాటు మరణించిన మిగతావారు కూడా ఢిల్లీకి చెందిన పౌరులని, వారంతా తమవారని కేజ్రీవాల్‌తెలిపారు. ఎమ్మెల్యేలతో సమావేశంలో కొన్ని విషయాలు తన దృష్టికి వచ్చాయని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి కొంతమంది చొరబడుతున్నట్లు తెలిసిందన్నారు. వెంటనే సరిహద్దులను మూసేసి , వారిని ముందస్తు అరెస్టు చేయాలని తాను సూచించినట్లు తెలిపారు. దీంతో పాటు ఆందోళనలో తీవ్రంగా గాయపడినవారికి ఉత్తమమైన వైద్యం అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా

మరికొందరు విడిపోయి పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో హింసాత్మకంగా మారింది.

Related Posts