70వ రోజుకి చేరుకున్న అమరావతి రైతుల ఆందోళనలు
అమరావతి ఫిబ్రవరి 25
అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు 70వ రోజుకి చేరుకున్నాయి. మందడం, తుళ్లూరులో ధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 70వ రోజు రిలే దీక్షలు కొనసాగనున్నాయి. పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలులో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మందడం డ్రోన్ వ్యవహారంలో రైతుల అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆలూరి వెంకటేశ్వరావు అనే రైతుని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ డ్రోన్ కేసులో ఇప్పటికే పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.