YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్టీఆర్ చివరి కోరిక జగన్ తీరుస్తారు : లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్ చివరి కోరిక జగన్ తీరుస్తారు : లక్ష్మీ పార్వతి

 ఎన్టీఆర్ చివరి కోరిక జగన్ తీరుస్తారు : లక్ష్మీ పార్వతి
విజయవాడ,, ఫిబ్రవరి 25
ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు టార్గెట్‌గా ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆమె.. ఎన్టీఆర్ చివరి కోరికను బయటపెట్టారు. చంద్రబాబును  జైలుకు పంపడమే ఎన్టీఆర్ కోరికని లక్ష్మీపార్వతి అన్నారు. ఆయన చనిపోకముందు చంద్రబాబుపై చాలా కోపంతో ఉన్నారని.. ఒకవేళ తాను అధికారంలోకి వస్తే బాబును అండమాన్ జైలుకు  పంపాలని తనతో అంటుండేవారన్నారు. చివరి రోజుల్లో చంద్రబాబు తీరుతో క్షోభకు గురయ్యారన్నారు.టీడీపీ సర్కార్ హయాంలో జరిగిన నిర్ణయాలు, అవినీతిపై ముఖ్యమంత్రి జగన్ సిట్  ఏర్పాటు చేశారని.. విచారణలో అన్ని వాస్తవాలు బయటపడం ఖాయమన్నారు లక్ష్మీపార్వతి. నిజాలు బయటకొచ్చాక చంద్రబాబుతో పాటూ అచ్చెన్నాయుడు, సుజనా చౌదరి వంటి నేతలు  కూడా జైలుకెళ్లడం తాను కచ్చితంగా చూస్తానని అంటున్నారు. ఎన్టీఆర్ కోరికను జగన్ తీరుస్తారని పరోక్షంగా వ్యాఖ్యానించారు.మరోవైపు చంద్రబాబు లక్ష్మీపార్వతి కోర్టులో పిటిషన్ వేసిన  సంగతి తెలిసిందే. హైదరాబాద్ ఏసీబీ కోర్టులో చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ స్టేకు బ్రేకులు పడ్డాయి. తాజాగా ఈ పిటిషన్ విచారణ మళ్లీ ప్రారంభమైంది.

Related Posts