YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జాస్తి’ సస్పెన్షన్‌ను రద్దు చేసిన క్యాట్

జాస్తి’ సస్పెన్షన్‌ను రద్దు చేసిన క్యాట్

జాస్తి’ సస్పెన్షన్‌ను రద్దు చేసిన క్యాట్
విజయవాడ, ఫిబ్రవరి 25 
కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్‌)లో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ సస్పెన్షన్‌ను క్యాట్‌ రద్దు చేసింది. కృష్ణ కిశోర్ తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్ అనుమతిచ్చింది. ఏపీ ప్రభుత్వం ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ను సస్పెండ్ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కృష్ణ కిశోర్ క్యాట్‌ను ఆశ్రయించారు. దీంతో అప్పీళ్లను పరిశీలించిన క్యాట్.. కిశోర్‌ను సస్పెండ్ చేస్తూ జగన్ సర్కారు ఇచ్చిన ఉత్తర్వులపై తొలుత స్టే విధించింది.కృష్ణ కిశోర్‌ టీడీపీ హయాంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పని చేశారు. మూడేళ్ల పదవీ కాలానికి గతంలో చంద్రబాబు ఆయన్ను ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా నియమించారు. 1990 బ్యాచ్‌కు చెందిన కృష్ణ కిశోర్.. అంతకు ముందు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు వద్ద సెక్రటరీగా పని చేశారు.కృష్ణ కిశోర్‌‌పై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెండ్‌ చేస్తున్నట్లు జగన్ సర్కార్ గతంలో ప్రకటించింది. కృష్ణ కిశోర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో.. పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. అనంతరం కృష్ణ కిశోర్‌పై కేసు నమోదు చేయాలని సీఐడీ, ఏసీబీని ఆదేశించింది.. ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని సూచించింది. విచారణ పూర్తయ్యేవరకు అమరావతి విడిచి వెళ్లకూడదని కృష్ణ కిశోర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అనంతరం ఆయనపై సెక్షన్ 188, 403, 409, 120 బీ కింద సీఐడీ కేసు నమోదు చేసింది.

Related Posts