YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మహాత్ముడికి ట్రంప్ నివాళి..

మహాత్ముడికి ట్రంప్ నివాళి..

మహాత్ముడికి ట్రంప్ నివాళి..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25  
రెండో రోజు భారత పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. అనంతరం త్రివిధ దళాల సైనిక వందనం స్వీకరించారు. అక్కడి నుంచి నేరుగా ట్రంప్ దంపతులు రాజ్‌ఘాట్ వెళ్లి మహాత్మా గాంధీ సమాధిని సందర్శించుకున్నారు. సమాధి వద్ద పుష్ఫ గుచ్ఛం ఉంచి.. ఒక ప్రదక్షిణ చేసి గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఒక నిమిషం పాటు మౌనం వహించారు. ట్రంప్, మెలనియా దంపతులకు అధికారులు రాజ్‌ఘాట్ గురించి వివరించారు.సమాధిని సందర్శించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు అక్కడ ఉన్న సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని రాసి సంతకం చేశారు. అనంతరం మెలనియా కూడా సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. అనంతరం అధికారులు మహాత్మాగాంధీ జ్ఞాపికను ట్రంప్ దంపతులకు అందజేశారు. అనంతరం రాజ్ ఘాట్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొక్కను నాటారు.రాజ్‌ఘాట్ నుంచి ట్రంప్ నేరుగా హైదరాబాద్ హౌస్‌కు చేరుకుంటారు. ఇక్కడే భారత్, అమెరికా మధ్య పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరగనున్నాయి రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్ దంపతులకు రెడ్ కార్పెట్భారత్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు రెండో రోజు ఉదయం రాష్ట్రపతి భవన్‌‌లో రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ట్రంప్, మెలనియాకు కోవింద్ దంపతులు, ప్రధాని మోదీ సాదర స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్ దంపతులకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. అంతకు ముందు అమెరికా అధ్యక్షుడు త్రివిధ దళాల సైనిక వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌, సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ దళాధిపతులు, కాన్సులేట్‌ సభ్యులను ట్రంప్‌కు మోదీ పరిచయం చేశారు.  మెలనియా ట్రంప్.. ఢిల్లీ నానక్‌పురలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. సర్వోదయ విద్యాలయ సీనియర్ సెకండరీ స్కూల్‌ను సందర్శించి.. ‘హ్యాపీనెస్ క్లాస్’ ప్రోగ్రాం అమలవుతున్న తీరును ఆమె పరిశీలించారు.

Related Posts