YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 బంగారం, వెండి పరుగలకు బ్రేక్

 బంగారం, వెండి పరుగలకు బ్రేక్

 

 బంగారం, వెండి పరుగలకు బ్రేక్
ముంబై, ఫిబ్రవరి 27,
బంగారం ధర పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. గత ఆరు రోజులుగా ర్యాలీ చేస్తూ వచ్చిన పసిడి ఈ రోజు మాత్రం తగ్గింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి కొంత ఊరట కలిగిందని చెప్పుకోవచ్చు. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. పసిడి ధర కన్నా వెండి ధర ఇంకా భారీగా పడిపోయింది.బంగారం ధర తగ్గడానికి మూడు అంశాలను ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గడం ఒక కారణం. దీంతో భారత్‌లోనూ బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. మనం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. అందువల్ల అంతర్జాతీయ రేట్లు మన దేశంలో బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. అలాగే బంగారం ధర ఇటీవల కాలంలో భారీగా పెరుగుతూ రావడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. దీంతో కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. ఇది రెండో కారణం. ఇంకా రూపాయి రికవరీ చెందటం కూడా పసిడి తగ్గుదలకు మూడో కారణం.హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం కొద్దిగా తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.30 క్షీణించింది. దీంతో పసిడి ధర రూ.41,000 నుంచి రూ.40,970కు దిగొచ్చింది.అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే కొనసాగింది. దీంతో ధర రూ.44,700 వద్దనే నిలకడగా ఉంది. ఇకపోతే ధర ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాలంలో బంగారం ధర ఏకంగా రూ.2 వేలకు పైగా పరుగులు పెట్టింది.బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర భారీగా పతనమైంది. ఏకంగా రూ.1500 పడిపోయింది. దీంతో కేజీ వెండి ధర రూ.51,500 నుంచి రూ.50,000కు దిగొచ్చింది. అంటే కేజీ వెండి ధర అర లక్ష దగ్గర ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.అంతర్జాతీయ మార్కెట్‌లో 7 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరిన బంగారం ధర ఈరోజు దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 1.59 శాతం తగ్గుదలతో 1650.05 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 2.99 శాతం క్షీణతతో 18.31 డాలర్లకు తగ్గింది.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.30 తగ్గుదలతో 10 గ్రాములకు రూ.40,970కు క్షీణించింది. వెండి ధర రూ.50,000కు దిగొచ్చింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో మాత్రం వెండి, పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఏకంగా 25 శాతం మేర పరుగులు పెట్టిన పుత్తడి.. కొత్త ఏడాదిలోనూ దూకుడు కనబరుస్తోంది. బంగారం ధర 2020 ఆరంభం నుంచే పరుగులు పెడుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 7 శాతం మేర పెరిగింది. దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. వెండి ధర కూడా వెలిగిపోతోంది. దేశీ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుదల సహా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటంతో బంగారం ధర పైపైకి కదులుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.పసిడి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు. అలాగే ఎల్లప్పుడూ తగ్గుతూ కూడా రాదు. బంగారం ధర పరిస్థితులకు అనుగుణంగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా ఉండొచ్చు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts