YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం...

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం...

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం...
ఫిబ్రవరి 25  
అమెరికాలోని తెలుగు సమాజంలో విషాదం నెలకొంది. అమెరికాలోని ఎఫ్ఎం 423 ఇంటర్ సెక్షన్ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురూ సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మృతి చెందిన వారిని రాజా, ఆవుల దివ్య, ప్రేమ్ నాథ్ అని గుర్తించారు. వీరి స్వస్థలం హైదరాబాద్. వీరిలో రాజా, దివ్య దంపతులు. ముషీరాబాద్ లోని గాంధీనగర్ కాలనీకి చెందినవారు. కాగా, ఈ దుర్ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

Related Posts