YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తమలపాకు కోసం వచ్చి కోడలితో అఫైర్

తమలపాకు కోసం వచ్చి కోడలితో అఫైర్

తమలపాకు కోసం వచ్చి కోడలితో అఫైర్
బెంగళూర్, ఫిబ్రవరి 26 
క్రమ సంబంధాల మోజులో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. భర్త కళ్లుగప్పి ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న భార్య బాగోతం ఆమె అత్త కంటపడడంతో దారుణానికి ఒడిగట్టింది.  రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో హైడ్రామాకు తెరతీసింది. కనీస మానవత్వం లేకుండా అతి కిరాతకంగా హత్య చేసి ఏమీ ఎరగనట్టు నటించింది. భర్తకి ఫోన్ చేసి లబోదిబోమంది. పోలీసులు  సీన్‌లోకి రావడంతో అసలు విషయం బయటపడింది. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.నగరంలోని బ్యాటరాయనపుర మెయిన్ రోడ్డులో కుమార్, సౌందర్య  దంపతులు నివసిస్తున్నారు. కుమార్ తల్లి రాజమ్మ(60) కొడుకుతో పాటే ఉంటోంది. సడెన్‌గా ఓ రోజు రాజమ్మ రక్తపు మడుగులో శవమై కనిపించింది. కంగారుపడిన కోడలు భర్తకి ఫోన్  చేసింది. ప్రైవేట్ మార్కెటింగ్ సంస్థలో పనిచేసే కుమార్ బిజీగా ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అతని భార్య సౌందర్య ఇంటి యజమానికి ఫోన్ చేయడంతో ఆయన ఇంటి వద్దకు వచ్చి  కుమార్‌కి మరోమారు ఫోన్ చేయడంతో విషయం చెప్పాడు.తల్లి హత్య విషయం విన్న కుమార్ వెంటనే ఇంటికొచ్చేశాడు. ఆమె మెడలో బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయినట్లు  గుర్తించారు. ఎవరైనా దొంగలు బంగారం కోసం చంపేసి ఉంటారని అనుమానించారు. ఆ సమయంలో కోడలు సౌందర్య సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లానని.. గంట తర్వాత వచ్చి చూస్తే చనిపోయి పడి ఉందని భోరుమంది. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇనుప రాడ్డుతో కొట్టడంతో చనిపోయినట్లు గుర్తించారు.అయితే ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికొచ్చిందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి దొంగల పనిగా భావించిన పోలీసులు.. కోడలు సౌందర్యను అనుమానించారు. ఆమెను తీసుకెళ్లి తమ స్టైల్లో విచారించడంతో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. రాజమ్మకు తమలపాకు వేసుకునే అలవాటు ఉంది. కొద్దికాలంగా ఆ ఏరియాలో లైన్‌ మ్యాన్‌గా పని చేస్తున్న నవీన్ జడేస్వామి అనే వ్యక్తి తరచూ రాజమ్మ వద్దకు వచ్చేవాడు. తమలపాకులు అడిగి తీసుకుని వేసుకునేవాడు.నెమ్మదిగా కోడలు సౌందర్యతో సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. భర్త  కుమార్ ఆఫీస్‌కి వెళ్లిన సమయంలో తమలపాకుల సాకుతో ప్రియుడు నవీన్ ఇంటికి వచ్చేవాడు. కోడలు సౌందర్యతో బెడ్రూమ్‌లో రాసలీలలు సాగించేవాడు. ఓ రోజు ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో సడెన్‌గా అత్త రాజమ్మ ఇంట్లోకి వచ్చింది. వాళ్లిద్దరినీ అలా చూసిన రాజమ్మ.. కోడలిని తీవ్రంగా హెచ్చిరించింది. కొడుక్కి చెప్పి పంచాయితీ పెడతానని బెదిరించడంతో భయపడిపోయిన కోడలు దారుణానికి ఒడిగట్టింది.

Related Posts