YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

క్లీనెస్ట్ రైల్వే స్టేషన్లు

క్లీనెస్ట్ రైల్వే స్టేషన్లు

క్లీనెస్ట్ రైల్వే స్టేషన్లు
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26
భద్రమైన  ప్రదేశాలు ఎప్పుడూ సురక్షితమైన ప్రదేశాలుగా కూడా ఉంటాయి. కానీ నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే ప్రదేశాలలో ఇది సాధ్యపడుతుందా? అంటే అవునని నిరూపిస్తున్నాయి భారత  దేశంలోని ఈ రైల్వే స్టేషన్లు. సాధారణంగా రైల్వే స్టేషన్లు ఎప్పుడూ ప్రయాణికుల తాకిడితో కిటకిటలాడుతూ ఉంటాయి. వీటిని పరిశుభ్రంగా ఉంచడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయం.  కానీ వాటన్నింటినీ అధిగమిస్తూ ప్రయాణికులకు పరిశుభ్రతతో పాటు భద్రమైన భావనను ఈ రైల్వే స్టేషన్లు అందిస్తున్నాయి. ఇంతకీ భారత దేశంలో ఉన్న ఆ పరిశుభ్రమైన రైల్వే స్టేషన్లు  ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.విజయవాడ జంక్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడవ అతిపెద్ద నగరంగా, భారత దేశంలో నాల్గవ రద్దీ రైల్వే స్టేషన్ గా గుర్తింపు పొందింది. అలాగే దేశంలోని అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్లలో  ఒకటిగా విజయవాడ స్టేషన్ చోటు సంపాదించింది. ఈ నగరంలో అత్యంత పురాతనమైన కనకదుర్గ దేవాలయం ఉంది. కృష్ణా నది ఒడ్డున ఇంద్ర కీలాద్రి కొండపై ఉన్న ఈ అమ్మవారిని  దర్శించుకునేందుకు నిత్యం భక్తులు వస్తుంటారు.అత్యంత సుందరమైన వారసత్వ నగరాల్లో ఉదయ్ పూర్ ఒకటి. ఇక్కడ అనేక పర్యాటక ఆకర్షణలతో పాటు రైల్వే స్టేషన్ కూడా టూరిస్టులను ఆకట్టుకుంటుంది. గార్డెనింగ్ తో పాటు  పరిశుభ్రమైన వాతావరణం ఎంతో ఆహ్లాదభరితంగా అనిపిస్తుంది. ఉదయ్ పూర్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉన్నందున రైల్వే స్టేషన్ శుభ్రత లో కూడా రాజీ లేని ప్రమాణాలను కలిగి ఉంది.  శంలోని అత్యంత శుభ్రమైన రైల్వే స్టేషన్ల జాబితాలో ఉన్న మరో ప్రదేశం కూడా రాజస్థాన్ రాష్ట్రంలోనే ఉంది. శ్రీ గంగనగర్ జిల్లాలో ఉన్న సూరత్ ఘర్ రైల్వే స్టేషన్ ఈ జాబితాలో చోటు సంపాదించుకుంది. ఈ ప్రాంతాన్ని రాజస్థాన్ యొక్క ఫుడ్ బాస్కెట్ గా పిలుస్తుంటారు. సూరత్ ఘర్ రైల్వే స్టేషన్ లో పరిశుభ్రతను చూసిన పర్యాటకులు ఎవరైనా ఆశ్చర్యపడక మానరు.జైపూర్ మాదిరిగానే జోధ్ పూర్ యొక్క గొప్ప పర్యాటక ఆకర్షణలు దేశ విదేశీ టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇక్కడికి పర్యాటకులు రాక పోకలు సాగించే రైల్వే స్టేషన్ ను  సాధ్యమైనంత శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ద్వారా జోధ్ పూర్ తన రాజరిక స్వభావాన్ని పర్యాటకులు మొట్ట మొదట అడుగు పెట్టే ప్రదేశం నుంచే చాటుతుంటుంది.జమ్మూ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రైల్వే స్టేషన్ జమ్మూ తావి రైల్వే స్టేషన్. ఇక్కడ ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి ఆలయాన్ని, ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఎంతో మంది  పర్యాటకులు నిత్యం ఈ స్టేషన్ కు వస్తుంటారు. ఇది భారత దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ల జాబితాలో చోటు సంపాదించింది. ఇక్కడ పర్యాటకులకు సౌకర్యవంతమైన వసతి సదుపాయాలు కూడా లభిస్తాయి.మన దేశంలోని ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానాల్లో పింక్ సిటీగా పేరొందిన జాపూర్ ఒకటి. ఇక్కడి రైల్వే స్టేషన్ దేశంలోని అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడి  పరిశుభ్రత రాజస్థాన్ గుర్తింపును మరింత పెంచడమే కాకుండా దేశ విదేశీ టూరిస్టులను ఎంతో ఆకట్టుకుంటుంది. అదే విధంగా దేశంలో విలాసవంతమైన రైళ్లలో ఒకటైన ప్యాలెస్ ఆన్ వీల్స్  కూడా జైపూర్ గుండా వెళుతుంది.భారత దేశంలోని అత్యంత ప్రాచీన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో హరిద్వార్ ఒకటి. ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతాన్ని హిందువులు అధిక సంఖ్యలో  సందర్శిస్తుంటారు. ఇక్కడ యాత్రికులు, పర్యాటకుల రాక పోకలకు హరిద్వార్ రైల్వే స్టేషన్ ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతే కాదు ఇది ఎల్లప్పుడూ ఎంతో పరిశుభ్రంగా  నిర్వహించబడుతుంది. రైల్వే ప్లాట్ ఫాం, స్టేషన్ చుట్టు ప్రక్కల ప్రాంగణాలు కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.రైల్వే నెట్ వర్క్ లో మొట్టమొదటి మహిళా రైల్వే స్టేషన్ గా పేరు పొందిన  ఈ రైల్ హెడ్ ను సిబ్బంది ఎంతో చక్కగా, పరిశుభ్రంగా ఉంచుతారు. ఢిల్లీ నుంచి ఇక్కడికి చాలా రైళ్లు నడుస్తుంటాయి. జైపూర్ లోని ఈ గాంధీ నగర్ రైల్వే స్టేషన్ టోంక్ రోడ్ & జవహర్ లాల్  నెహ్రూ మార్గ్ సమీపంలోని బజాజ్ నగర్ ప్రాంతంలో ఉంది. దుర్గా పుర రైల్వే స్టేషన్ జైపూర్ రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో నార్త్ వెస్ట్రన్ రైల్వే నెట్ వర్క్ లో ఉంది. ఈ స్టేషన్ చాలా నిశబ్ధంగా ఉండడమే కాకుండా సిబ్బంది కూడా  సహాయపడే విధంగా ఉంటారు. ఇక్కడ విశాలమైన పార్కింగ్ ప్రాంతంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్ధం అనేక వసతులను కూడా అందుబాటులో ఉంచారు.

Related Posts