YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉద్యోగం మానస్తే... జీతం మొత్తం రిఫండ్ చేయాలంట

ఉద్యోగం మానస్తే... జీతం మొత్తం రిఫండ్ చేయాలంట

ఉద్యోగం మానస్తే... జీతం మొత్తం రిఫండ్ చేయాలంట
విజయవాడ, ఫిబ్రవరి 27
ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకం గురించి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షమందికిపైగా ఉద్యోగులు నిర్వహిస్తున్నారు. అయితే ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటి.. కేవలం ఒక్క రాజీనామా లేఖ ఇస్తే సరిపోతుందా అంటే కుదరదు అంటున్నాయి నిబంధనలు. అప్పటి వరకు తీసుకున్న జీతం చెల్లించాల్సిందే.. అవును నిబంధనలు అలాగే ఉన్నాయి. తాజాగా ఇలాంటి సమస్యే ఓ సచివాలయ ఉద్యోగికి ఎదురైంది.అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి గ్రామ సచివాలయంలో మహేష్‌రెడ్డి.. డిజిటల్ అసిస్టెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అతడికి ఇటీవల రైల్వేలో ఉద్యోగం వచ్చింది.. దీంతో గ్రామ సచివాలయ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అంతా సాఫీగా సాగిపోతుందని భావించాడు.. కానీ అధికారులు ట్విస్ట్ ఇచ్చారు. ఆయన శిక్షణ కోసం ఖర్చు చేసిన రూ. 2 వేలు, 3 నెలల 25 రోజులకు చెల్లించిన వేతనం కలిపి జీతంగా తీసుకున్న మొత్తం రూ. 57,095 లను తిరిగి కట్టమని అధికారులు చెప్పారు. జీతం కింద తీసుకున్న ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తేనే.. రాజీనామాను ఆమోదిస్తామన్నారు.విజయనగరం జిల్లాలో కూడా కొంతమంది యువకులకు ఇదే పరిస్థితి ఎదురైంది. గజపతినగరం మండలం కొత్తబగ్గం, గంట్యాడ మండలం కొర్లాంలో ఇద్దరు డిజిటల్ అసిస్టెంట్లు.. మెరుగైన ఉద్యోగాలు రావడంతో రాజీనామా చేశారు. వారికి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దీంతో జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత ఎంపీడీవోలకు లేఖ రాస్తూ.. ఉద్యోగానికి రాజీనామాలు చేసిన ఇద్దరూ ఇప్పటిదాకా తీసుకున్న జీతభత్యాలు, ఇతర అలవెన్సులు సంబంధిత శాఖలకు జమ చేసిన తర్వాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారట. ఇదిలా ఉంటే ఈ జీతాల చెల్లింపుపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. జీతం తిరిగి చెల్లించే విషయాన్ని రూల్ నెంబర్ 9లో ప్రస్తావించామని.. నిబంధనలకు అనుగుణంగానే తాము వ్యవహరిస్తున్నామంటున్నారు. ఉద్యోగంలో చేరే ముందు సంబంధిత వ్యక్తి కూడా ఓకే చెప్పారని గుర్తు చేస్తున్నారు.

Related Posts