YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

నదిలో పడిన పెళ్లి బస్సు 24 మంది మృతి

నదిలో పడిన పెళ్లి బస్సు 24 మంది మృతి

.నదిలో పడిన పెళ్లి బస్సు 24 మంది మృతి
రాజస్థాన్‌, ఫిబ్రవరి 
పెళ్లి వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు నదిలో పడి 24 మంది దుర్మరణం చెందిన సంఘటన రాజస్థాన్‌లో బుధవారం ఉదయం జరిగింది.ఘటన సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణిస్తుండాగా ఇప్పటివరకు కనీసం 24 మంది మృతిచెందినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బూండీలోని కోట లాల్‌సాత్‌ మెగా హైవేపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది.పెళ్లి వేడుక నిమిత్తం వరుడి కుటుంబం, బంధువులతో కోట నుంచి సవాయ్‌మాధోపూర్‌ వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు వంతెనపై నుంచి మేజ్‌ నదిలో బోల్తాపడింది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.

Related Posts