YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 శ్రీశైలంలో ఎమ్మెల్యే రోజా

 శ్రీశైలంలో ఎమ్మెల్యే రోజా

 శ్రీశైలంలో ఎమ్మెల్యే రోజా
శ్రీశైలం ఫిబ్రవరి 27
నగరి ఎమ్మెల్యే, సినీనటి ఆర్ కే రోజా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను గురువారం  తెల్లవారుజామున దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ రాజగోపురం నుంచి  మర్యాదపూర్వకంగా శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామారావు ఘనంగా ఆహ్వానించి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను దర్శింప చేశారు. ఈ మేరకు స్వామి  అమ్మవార్లకు రుద్రాభిషేకాలను కుంకుమార్చనలను నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాద మండపంవద్ద ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అమ్మ వారి శేష వస్త్రాలు అలాగే  స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని బహుమతిగా ఆలయ అధికారులు అందజేశారు.తరువా ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అందరిని చల్లగా చూడాలని ఈ రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో వర్ధిల్లాలని కోరుకున్నానని అన్నారు.  ఇప్పుడు జగన్ ప్రభుత్వం పై చంద్రబాబు దాడి చేస్తున్నారని దిగజారుడు రాజకీయాలు చేసి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రయత్నిస్తున్నారని ఆయన తరం కాదని తెలిపారు. చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఏడుపే అని రాష్ట్రం అప్పుల్లో ఉంది డబ్బులు లేవని మభ్యపెట్టి తాను మాత్రం దోచుకున్నాడు అని జగన్ మాత్రం అం అప్పుల్లో ఉంది అని చెప్పకుండా తాను ఇచ్చిన  వాగ్దానాన్ని పేదల కష్టాలను దూరం చేసే విధంగా ఒక్కో పథకాన్ని విజయవంతంగా అమలు చేసి దేశం మొత్తం జగన్ వైపు చూసే విధంగా పరిపాలన చేస్తున్నారని ఆమె అన్నారు. రాష్ట్రం  కష్టాలు నష్టాల్లో ఉంది కాబట్టి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడం వికేంద్రీకరణ ద్వారా మూడు రాజధానులు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చంద్రబాబు మాత్రం ఎలా  అడ్డుకోవాలి ఎమ్మెల్యేలపై ఎంపీలపై తమ వర్గం తో దాడి చేయించి తన మీడియాను అండగా చేసుకుని అహంకారంతో ప్రవర్తించడం ఆయనకు సరైన పద్ధతి కాదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు  పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంది అని తన పి ఎస్ శ్రీనివాస్ పై ఐటీ దాడులు చేస్తే భయపడిపోయారని ఈ రాష్ట్రాన్ని దోచుకొని దాచుకున్న డబ్బులు లెక్కల్లో తేలిపోతుందని  విదేశాలకు కోట్ల డబ్బులు ట్రాన్సాక్షన్ చేయించారని చంద్రబాబు లోకేష్ ఆయన క్యాబినెట్ తొందరలో జైలుకు వెళ్లే రోజులు తొందరలో ఉన్నాయని ఆమె అన్నారు. 

Related Posts