జమ్ము, కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం సర్దుబాటు ఉత్తర్వులకు ఆమోదం
న్యూ డిల్లీ, ఫిబ్రవరి
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జమ్ము, కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2019 లోని 96వ సెక్షన్ లో భాగం గా జమ్ము, కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం లో కేంద్రీయ చట్టాల సర్దుబాటు కోసం ఒక ఉత్తర్వు ను జారీ చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగి న కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. జమ్ము, కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2019 అమలైన అనంతరం పూర్వపు జమ్ము, కశ్మీర్ రాష్ట్రాన్ని 2019వ సంవత్సరం అక్టోబరు 31వ తేదీ నాటి నుండి వర్తించే విధం గా జమ్ము, కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం గాను, అలాగే లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతం గాను పునర్ వ్యవస్థీకరించడం జరిగింది.ఇది వరకటి జమ్ము, కశ్మీర్ రాష్ట్రం మినహా, యావత్తు భారతదేశాని కి అమలవుతున్నటువంటి అన్ని కేంద్రీయ చట్టాలు ఇప్పుడు 2019 అక్టోబరు 31 నాటి నుండి కేంద్ర పాలిత ప్రాంతం అయిన జమ్ము, కశ్మీర్ కు వర్తిస్తాయి. అంతేకాకుండా, ఉమ్మడి జాబితా లోని కేంద్రీయ చట్టాల ను అవసరమైన మార్పు చేర్పులు మరియు సవరణల తో అనుసరించడానికి ఈ చర్య అవసరమైంది. తత్ఫలితం గా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ము, కశ్మీర్ కు సంబంధించినంత వరకు పాలన పరమైన ప్రభావశీలత్వం మరియు పరివర్తన సాఫీగా సాగిపోగలదు. దీనితో పాటు, భారత రాజ్యాంగానుసారం వాటి యొక్క అమలు లో ఏదైనా అస్పష్టత ఉంటే, దాని ని తొలగించినట్లు కూడా అవుతుంది. జమ్ము, కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ చట్టం, 2019 లోని సెక్షన్ 96 ప్రకారం కేంద్ర ప్రభుత్వాని కి చట్టాల లో మార్పు చేర్పులు మరియు అనుకూలతలు చేసే అధికారాలు ఉన్నాయి. ఇవి అవసరమైతే సవరణ, లేదా రద్దు ద్వారా గానీ, లేదా నియామకం తేదీ కన్నా ముందు ఏదైనా చట్టం యొక్క అమలు కు మార్గాన్ని సత్వరం సుగమం చేయడానికి గానీ ఈ అధికారాలు వర్తిస్తాయి. ఉత్తరాధికారి కేంద్ర పాలిత ప్రాంతాల కు సంబంధించిన నియామకం తేదీ నాటి నుండి ఒక సంవత్సరం అవధి తీరే లోపు.తదనుగుణం గా, ఈ రోజు న కేంద్ర మంత్రివర్గం సమావేశం లో సదరు 37 కేంద్రీయ చట్టాల సర్దుబాటు కు మరియు మార్పు చేర్పుల కు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వు ను జారీ చేసే ప్రతిపాదన ను ఆమోదించడమైంది.