YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇప్పడు మేం చెప్పలేం : నిర్మలా

ఇప్పడు మేం చెప్పలేం : నిర్మలా

ఇప్పడు మేం చెప్పలేం : నిర్మలా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 
కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌‌కు మీడియా సమావేశంలో ఊహించని పరిణామం ఎదురయ్యింది. ఓ జర్నలిస్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతుంటే పక్కనే ఉన్న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన సమయస్ఫూర్తిని ప్రదర్శించి బయటపడేశారు. న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆమె బృందం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి నుంచి అనురాగ్‌ ఠాకూర్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఇటీవల ఢిల్లీ శాసనసభ ఎన్నికల ప్రచారంలో అనురాగ్ ఠాకూర్‘గోలీ మారో సాలేన్ కో’ వ్యాఖ్యలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హైకోర్టు స్పందనపై సదరు విలేకరి ఠాకూర్‌ను ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.నురాగ్ ఠాకూర్ ఇబ్బందిని గమనించిన నిర్మలా సీతారామన్‌ వెంటనే స్పందించారు. ‘మీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతానన్న నిర్మలా.. బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలియజేయడం కోసమే ప్రత్యేకంగా ఈ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశాం. మీరు అడిగిన ప్రశ్నకు ఇక్కడ స్పందించబోం’ అని అన్నారు. ఇటీవల ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అనురాగ్‌ ఠాకూర్‌ సహా కొందరు బీజేపీలు నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే.సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారంతా ‘దేశ ద్రోహులు’అలాంటి వారికి కాల్చి చంపాలి (గోలీమారో సాలేన్ కో) అంటూ అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వీరిని బీజేపీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్‌ల జాబితా నుంచి తొలగించాలని ఆదేశించి, నిషేధం విధించింది. తాజాగా ఆ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ అల్లర్ల కేసు విచారణ సందర్భంగా ఆ వీడియోలను ప్రదర్శించిన న్యాయస్థానం.. సదరు నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పోలీసులను నిలదీసింది.

Related Posts