YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు
ముంబై, ఫిబ్రవరి  28
పసిడి పతనానికి బ్రేకులు పడ్డాయి. బంగారం ధర మళ్లీ భగభగమంటోంది. మిలమిలంటూ మెరిసిపోతోంది. గత రెండు రోజులుగా పడిపోతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు మాత్రం పైకి కదిలింది. దీంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇకపోతే బంగారం ధర పరుగులు పెడితే.. వెండి ధర మాత్రం తగ్గుతూనే వస్తోంది.బంగారం ధర పెరుగుదలకు కరోనా వైరస్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ర్యాలీ చేయడానికి ఇది దోహదపడుతోంది. దీంతో భారత్‌లోనూ  బంగారం ధరపై సానుకూల ప్రభావం పడింది. మనం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. అందువల్ల అంతర్జాతీయ రేట్లు మన దేశంలో బంగారం ధరను ప్రభావితం చేస్తాయి. కరోనా  వల్ల గ్లోబల్ ఎకానమీపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో సురక్షిత సాధనమైన పసిడిని ఎక్కువగా కొంటున్నారు. దీంతో బంగారం డిమాండ్  పెరిగింది.హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పరుగులు పెట్టింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.210 పైకి కదిలింది. దీంతో పసిడి ధర రూ.40,610 నుంచి రూ.40,820కు చేరింది. కాగా బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చింది. ఈ కాలంలో పసిడి ధర రూ.390 దిగొచ్చింది.అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం  ధర కూడా పైకి కదిలింది. ఇది కూడా రూ.210 పెరిగింది. దీంతో ధర రూ.44,340 నుంచి రూ.44,550కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.360 తగ్గిన విషయం తెలిసిందే.బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోతూనే వస్తోంది. రూ.200 క్షీణించింది. దీంతో కేజీ వెండి ధర రూ.49,800 నుంచి రూ.49,600కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వెండి ధర తగ్గుతూ రావడం ఇది వరుసగా మూడో రోజు కావడం గమనార్హంఅంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదలతో 1644.65 డాలర్లకు ఎగసింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.49 శాతం పెరుగుదలతో 17.74 డాలర్లకు చేరింది.ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా పసిడి, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే  ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.210 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.40,820కు చేరింది. వెండి ధర రూ.49,600కు దిగొచ్చింది.  ఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పసిడి రూ.250 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.41,700కు చేరింది.గతేడాది ఏకంగా 25 శాతం మేర పరుగులు పెట్టిన పుత్తడి.. కొత్త ఏడాదిలోనూ దూకుడు కనబరుస్తోంది. బంగారం ధర 2020 ఆరంభం నుంచే పరుగులు పెడుతూ వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఈ  ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 8 శాతం మేర పెరిగింది. దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. వెండి ధర కూడా వెలిగిపోతోంది. దేశీ మార్కెట్‌లో డిమాండ్ పెరుగుదల సహా అమెరికా  డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటంతో బంగారం ధర పైపైకి కదులుతోందని నిపుణులు పేర్కొంటున్నారు.పసిడి ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉండదు. అలాగే ఎల్లప్పుడూ  తగ్గుతూ కూడా రాదు. బంగారం ధర పరిస్థితులకు అనుగుణంగా తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో స్థిరంగా కూడా ఉండొచ్చు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు  చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు  వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. 

Related Posts