YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

6 గంటలు  నరకం .. 400 కత్తి పోట్లు.. పేగులు లాగి ఆగి ఆగి..  ఒక్కొక్క పోటూ పొడుస్తూ నరకం చూపారు..!

6 గంటలు  నరకం .. 400 కత్తి పోట్లు.. పేగులు లాగి ఆగి ఆగి..  ఒక్కొక్క పోటూ పొడుస్తూ నరకం చూపారు..!

6 గంటలు  నరకం .. 400 కత్తి పోట్లు.. పేగులు లాగి ఆగి ఆగి..  ఒక్కొక్క పోటూ పొడుస్తూ నరకం చూపారు..!
ఢిల్లీ డ్రైనేజీలో శవమై తేలిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో యువ అధికారి అంకిత్‌ శర్మ చివరిక్షణాల్లో అనుభవించిన నరకయాతన ఇది!!  అతడి మృతదేహానికి పోస్టుమార్టమ్‌ నిర్వహించిన వైద్యులు నివేదికలో ఈ విషయాలను పొందుపరిచారు అతడి శరీరంలో ఒక్క అవయవాన్ని కూడా వదలకుండా అన్ని భాగాలపైనా కత్తితో పొడిచారని అందులో పేర్కొన్నారు. ఒక్కసారిగా చంపలేదు! నిదానంగా.. ఆగి ఆగి..  ఒక్కొక్క పోటూ పొడుస్తూ ఆరుగంటలపాటు నరకం చూపారు! జాలి, దయ, కనికరం అనే మాటలకు అర్థం మరిచి.. అక్షరాలా 400 సార్లు పొడిచి పొడిచి, పేగులు బయటకు లాగి ఉసురుతీశారు! ఆపై మృతదేహాన్ని మురుగు కాల్వలో పడేశారు!!నాలుగు నుంచి ఆరు గంటలపాటు.. కనీసం ఆరుగురు వ్యక్తులు ఈ దుర్మార్గాన్ని కొనసాగించి ఉంటారని వివరించారు. తమ జీవితంలో ఇప్పటివరకూ ఇంత దారుణమైన పీడకలలాంటి అవయవఛేదాన్ని (మ్యుటిలేషన్‌) చూడలేదని పేర్కొన్నారు. అంకిత్‌ శర్మ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఆప్‌ మాజీ నేత తాహిర్‌హుస్సేన్‌పై గురువారం హత్య కేసు నమోదు చేశారు.

Related Posts