YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

.టీడీపీ గూండాలతో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు: బొత్స

.టీడీపీ గూండాలతో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు: బొత్స

.టీడీపీ గూండాలతో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారు: బొత్స
అమరావతి, ఫిబ్రవరి 27  
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ఆయన సామాజిక వర్గం తప్ప ఇంకెవరూ అక్కర్లేదన్నారు. చంద్రబాబు రెండ్రోజులుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత పర్యటనను చంద్రబాబు రాజకీయాలకు వాడుకోవాలని చూశారని, టీడీపీ గూండాలతో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని బొత్స పేర్కొన్నారు. ‘‘అందరికీ వర్తించే చట్టాలు చంద్రబాబుకు వర్తించవా?, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉంటే మరోలా మాట్లాడుతారు. చంద్రబాబు నైజం మార్చుకోనంత కాలం నిరసనలే ఎదురవుతాయి. విశాఖలో అభివృద్ధి వద్దంటే.. నిరసన తెలపకుండా స్వాగతం పలుకుతారా?’’ అని బొత్స వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. విశాఖ వాసులు ఎంత సౌమ్యులో.. హక్కుల కోసం పోరాడటంలో వెనకాడరని బొత్స చెప్పారు.

Related Posts