చంద్రబాబు విశాఖ పర్యటన అడ్డుకోవడం దారుణం: యనమల
అమరావతి, ఫిబ్రవరి 27
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అడ్డుకోవడం దారుణమని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శించారు. విశాఖ ఎయిర్పోర్టులో యుద్ధవాతావరణం సృష్టిస్తారా? అంటూ మండిపడ్డారు. చంద్రబాబు కాన్వాయ్పై వైసీపీ దాడికి పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని ఫ్యాక్షన్ రాజ్యాంగా చేస్తారా? అని ప్రశ్నించారు.వైసీపీ అరాచకాల కోసం పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేస్తారా? అంటూ యనమల మండిపడ్డారు. ప్రజల దగ్గరకు వెళ్లే స్వేచ్ఛ ప్రజాప్రతినిధులకు లేదా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు గృహనిర్భంధాలు ఉండవా? అని అన్నారు. చంద్రబాబు కాన్వాయ్పై కోడిగుడ్లు విసురుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా?.. కావాలనే చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తతలు సృష్టించారని, వైసీపీ రౌడీల బారి నుంచి విశాఖను కాపాడుకోవాల్సింది ప్రజలేనని యనమల పేర్కొన్నారు.