చంద్రబాబు క్షమాపణ చెప్పాలి
విశాఖపట్నం ఫిబ్రవరి 28
విశాఖలో చంద్రబాబుకు ప్రజాగ్రహం కనిపించింది. చంద్రబాబును ప్రజలు అడ్డుకున్నారు. ప్రజలు అడ్డుకుంటే ఎల్లో మీడియా దుష్ర్పచారం చేస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను చంద్రబాబు అవమానపరుస్తున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టి లబ్దిపొందాలని చంద్రబాబు చూస్తున్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమాలు ఎల్లో మీడియాకు కనిపించడం లేదా ? - చంద్రబాబుకు డబ్బా కొట్టాడానికే ఎల్లో మీడియా పనిచేస్తుంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి చంద్రబాబుకు అవసరం లేదా ? టీడీపీ హయాంలో విశాఖలో భూ రికార్డులు తారుమారు అయ్యాయని అన్నారు. చంద్రబాబుపై టీడీపీలోని ఓ వర్గం వారే చెప్పులు వేసినట్లు ఆ పార్టీ నేతలే అంటున్నారు. పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలి. తన బినామీల కోసమే అమరావతి పేరుతో చంద్రబాబు డ్రామాలు అడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు. అందుకే ఎయిర్ పోర్టులో ప్రజాగ్రహం వెల్లువెత్తిందని అన్నారు. చంద్రబాబు,టీడీపీ నేతలు భూ దందాలు చేసి వేరేవాళ్లపై నెట్టేస్తున్నారు. నిన్న విశాఖ ఎయిర్ పోర్టులో జరిగింది చూసి జనం కర్మ సిద్ధాంతం అంటున్నారు. చేసిన తప్పుకు ఇప్పుడు వెంటనే శిక్ష ఉంటుందని రుజువైంది. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలి. ఉత్తరాంధ్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని అయన అన్నారు.