YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైకాపాలో చేరికలు

వైకాపాలో చేరికలు

వైకాపాలో చేరికలు
హిందూపురం ఫిబ్రవరి 28
హిందూపురంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన టిడిపి మహిళా నాయకురాలు, మాజీ కౌన్సిలర్ నాగేంద్రమ్మ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్  సమక్షంలో శుక్రవారం నాడు  వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమెతో పాటు అంబేద్కర్ నగర్ నుండీ 100టిడిపి కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ  కండువాలు కప్పి  సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా నాగేంద్రమ్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి అని, విద్య వైద్యం ఆరోగ్యం రైతులకు మంచి పథకాలు ఇలాంటి  ఎన్నో మంచి పనులు చేస్తున్నరని అన్నారు. ఇక హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్  కుల-మత, రాజకీయాలకు అతీతంగా అందరికీ సేవ చేస్తూ అందుబాటులో ఉన్నారని అన్నారు. ఈ  కార్యక్రమంలో సునీల్, ధర్మ, స్టోర్ మూర్తి, సీఎన్పీ నాగరాజు, కాలేపల్లి రమేష్, సడ్లపల్లి బాబు రెడ్డి, తిమ్మా రెడ్డి, రామాంజినేయులు, మోహన్ తదితరులు పాల్గొన్నారు

Related Posts