YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి

ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి

ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి
వరంగల్, ఫిబ్రవరి 28 
గులాబీ పార్టీలో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఈసారి మహబూబాబాద్ జిల్లా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టరేట్‌లోనే మంత్రి సత్యవతి రాథోడ్‌తో ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ వాగ్వాదానికి దిగడంతో జిల్లా నేతలంతా అవ్వాక్కయ్యారు. ఓ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సారెస్పీ మొదటి, రెండో దశ పనులు, చెక్‌డ్యాంలు, ఫీడర్‌ ఛానెళ్ల నిర్మాణాల ప్రగతిపై కలెక్టరేట్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశం ప్రారంభం అయ్యే సమయానికి వరంగల్‌ నుంచి ఆగమేఘాల మీద స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అక్కడికి వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఏదో అసహనంగా కనిపించారు. తన నియోజకవర్గంలో వివిధ రకాల పనులు పూర్తి కావడం లేదని, ఇక్కడ ప్రజాప్రతినిధులు గడ్డి పీకడానికి ఉన్నారా? అంటూ అధికారులపై చిర్రుబుర్రులాడారు. తన ప్రమేయం లేకుండానే ఇంత త్వరగా వాటిపై సమీక్ష నిర్వహించడం ఏంటని పరోక్షంగా అక్కడే ఉన్న మంత్రి సత్యవతి రాఠోడ్‌ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు.దీనిపై స్పందించిన మంత్రి ‘మధ్యాహ్నం సమీక్ష కార్యక్రమం ఉంటుందని మీకు ముందే చెప్పాం కదా.. మీరు మాట్లాడిందే కరెక్ట్‌ అంటే సరి కాదు’ అని మంత్రి బదులిచ్చారు. అయితే మీరే మాట్లాడుకోండి అంటూ శంకర్‌ నాయక్‌ బదులిచ్చారు. ఇంతలో కలెక్టర్‌ గౌతమ్‌ జోక్యం చేసుకొని ఎమ్మెల్యేకు సారీ చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగినట్లయింది. కాగా, తమ ప్రాంతంలో పట్టణ ప్రగతి కార్యక్రమంపై మున్సిపల్‌ కమిషనర్‌ తనకు సమాచారం ఇవ్వలేదంటూ కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కూడా ఆరోపించారు

Related Posts