YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 విశాఖ ఘటనపై  హైకోర్టు ఆగ్రహం

 విశాఖ ఘటనపై  హైకోర్టు ఆగ్రహం

 విశాఖ ఘటనపై  హైకోర్టు ఆగ్రహం
గుంటూరు, ఫిబ్రవరి 28 
విశాఖలో చంద్రబాబు పర్యటనపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. విశాఖ ఎయిర్‌పోర్టులో పోలీసుల వ్యవహారంపై ఫిర్యాదు చేస్తూ.. మాజీ ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు పట్ల పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ ఫైల్ చేశారు. రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ, విశాఖ పోలీస్ కమిషనర్, ఎస్పీలను ప్రతివాదులుగా చేర్చారు. దీనిని కోర్టు విచారణకు స్వీకరించింది.కోర్టులో విచారణ సందర్భంగా.. ముందస్తు అరెస్ట్‌ చేయాల్సింది రాళ్లు, కోడిగుడ్లు వేయడానికి వచ్చిన వాళ్లని కదా సీజేఏ ప్రశ్నించారు. ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని.. ఎయిర్‌పోర్టుకు రాకుండా వాళ్లని ఎందుకు నిలువరించలేకపోయారని ప్రస్తావించారు. తీవ్రమైన నేరాలకు ఇచ్చే సెక్షన్ 151 కింద చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడాన్ని సీజేఏ తప్పుబట్టారు. సెక్షన్ 151 కింద చంద్రబాబుకు నోటీసులు ఎలా ఇస్తారని.. దీనిపై సమగ్ర అఫిడవిట్ ఫైల్ చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను హైకోర్టు మార్చి 2కు వాయిదా వేసింది.విజయనగరం జిల్లాలో ప్రజా చైతన్య యాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబును విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెకాన్వాయ్ కదలకుండా భీష్మించుకు కూర్చున్నారు. అక్కడే నిలిచిపోయిన చంద్రబాబు.. కారులో నుంచి దిగి రోడ్డుపై బైఠాయించారు.. పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసులు అనుమతి ఇచ్చినా.. వైఎస్సార్‌సీపీ దుర్మార్గంగా తన యాత్రను అడ్డుకుంటోందని చంద్రబాబు అన్నారు. పోలీసులు సెక్షన్ 151 నోటీసులు జారీ చేశారు.. శాంతిభద్రతల పరిగణలోకి తీసుకొని ఆయన్ను తిరిగి వెళ్లిపోవాలని కోరారు. పోలీసుల సూచనలతో బాబు కొద్దిసేపటి తర్వాత హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లిపోయారు.

Related Posts