YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా శ్రీవాస్తవ

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా శ్రీవాస్తవ

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా శ్రీవాస్తవ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28  
ఢిల్లీకి కొత్త పోలీసు కమిషనర్ వచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్.ఎన్. శ్రీవాస్తవకు ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. మార్చి 1 నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. 1985 బ్యాచ్‌ అరుణాచల్ - గోవా - మిజోరాం కేంద్రపాలిత ప్రాంతం కేడర్‌కు చెందిన శ్రీవాస్తవను ఈ వారం ఆరంభంలో సీఆర్పీఎఫ్ నుంచి తీసుకొచ్చి స్పెషల్ పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్‌)గా నియమించారు. ఢిల్లీ అల్లర్లను అరికట్టడం కోసం ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ పదవీ కాలాన్ని ఒక నెల పొడిగించారు. ఆయన ఫిబ్రవరి 29న రిటైర్ అవుతున్నారు. కానీ సీఏఏ అల్లర్లను అరికట్టడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకూ 42 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.పౌరులకు భద్రత కల్పించడం, పోలీసులు ఉంది తమకోసమే అని భావన ప్రజల్లో కల్పించడమే తన తొలి ప్రాధాన్యమని శ్రీవాస్తవ పీటీఐతో తెలిపారు. శ్రీవాస్తవ జమ్మూకశ్మీర్ జోన్ సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీగా పని చేశారు. సైన్యంపై రాళ్లు రువ్విన అల్లరి మూకలను ఆయన సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇండియన్ ముజాహిద్దీన్‌పై విచారణ కోసం ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బాధ్యతలను కూడా శ్రీవాస్తవ గతంలో పర్యవేక్షించారు. ఆయన బీటెక్, ఎల్ఎల్‌బీ చదువుకున్నారు.

Related Posts