YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

కరోనాతో ప్రపంచకప్కు దూరం

కరోనాతో ప్రపంచకప్కు దూరం

కరోనాతో ప్రపంచకప్కు దూరం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29
చైనాను వ‌ణికిస్తున్న క‌రొనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌వ్యాప్తంగాను త‌న ప్ర‌భావం చూపిస్తోంది. తాజాగా క్రీడారంగంలోని ఓ టోర్నీ దీని ప్ర‌భావానికి గుర‌య్యింది. సైప్ర‌స్‌లో వ‌చ్చేనెల నుంచి జ‌రిగే  ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్‌ ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అధికారిక స‌మాచారం లేక‌పోయిన‌ప్ప‌టికీ, ఈ విష‌యాన్ని ఆ టోర్నీలో పాల్గొనాల్సిన ఇద్ద‌రు భార‌త ప్లేయ‌ర్లు  ధ్రువీక‌రించారు. కేంద్ర ప్ర‌భుత్వం స‌ల‌హా మేర‌కే ఈ టోర్నీ నుంచి భార‌త్ త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం.ఆట‌గాళ్లు, స‌హాయ‌క సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భార‌త జాతీయ రైఫిల్స్  సంఘం (ఎన్ఆర్ఏఐ) ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. సైప్ర‌స్‌లో వ‌చ్చేనెల 3 నుంచి ఈ టోర్నీ జ‌రుగ‌నుంది. భార‌త్‌తో క‌లిపి ఇప్ప‌టికే ఈ టోర్నీ నుంచి ఏడు దేశాలు త‌ప్పుకున్న‌ట్లు  తెలుస్తోంది.మ‌రోవైపు చైనాలో క‌రోనా ఉధృతి పెరుగుతోంది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి వైర‌స్ కార‌ణంగా మూడు వేల‌మందికిపైగా మ‌ర‌ణించిన‌ట్లు తెలుస్తోంది. అలాగే ప్ర‌పంచ‌వ్యాప్తంగా 80వేల మంది ప్ర‌భావితులైన‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు వ‌చ్చే జూలైలో జ‌రిగే ఒలింపిక్స్ నిర్వ‌హ‌ణ కూడా ఈ వైర‌స్ కార‌ణంగా ప్ర‌భావితం అవ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Related Posts