YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పోలీసు స్టేషన్ లో  గొంతు కోసుకొన్న నిందితుడు

పోలీసు స్టేషన్ లో  గొంతు కోసుకొన్న నిందితుడు

పోలీసు స్టేషన్ లో  గొంతు కోసుకొన్న నిందితుడు
జగిత్యాల ఫిబ్రవరి 29
జగిత్యాల జిల్లా మల్యాల పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఓ నిందితుడు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. సమాచారం ప్రకారం... 2017లో కొండగట్టు ప్రాంతంలో జరిగిన ఓ హత్య కేసులో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పెంట సాగర్ నిందితుడు. అతడిని పోలీసులు విచారణ కోసం మల్యాల సీఐ కార్యాలయానికి తీసుకొచ్చినట్లు తెలిసింది. అక్కడ సాగర్ మరుగుదొడ్డిలోకి వెళ్లి బ్లేడుతో గొంతు కోసుకున్నట్లు సమాచారం. పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని మొదట జగిత్యాల  ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. విషయం బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. అదనపు ఎస్పీ దక్షిణామూర్తి, డీఎస్పీ వెంకటరమణ ఆసుపత్రికి  వెళ్లి నిందితుడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.

Related Posts