విశాఖపై జగన్ కక్ష
శ్రీకాకుళం ఫిబ్రవరి 29
విశాఖపట్నం పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టుకున్నారు. విశాఖపట్నం ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తల్లి గత ఎన్నికల్లో విశాఖ ప్రజలు ఒడిపించడం తట్టుకోలేక విశాఖపట్నం పై ఫాక్షనిజం చూపిస్తున్నారని మాజీ మంత్రి కళా వెంకట్రావు అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ లేకుండా ధర్నా చేశారు. విశాఖపట్నం లో పెట్టుబడిదారులు తో మీటింగ్ జరుగుతుండగా ..మీటింగ్ జరగానీయకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు .అందువలన జగన్మోహన్ రెడ్డి కి పర్మిషన్ ఇవ్వలేదని ప్రతిపక్షనేతగా విశాఖ ఎయిర్ పోర్టులో ధర్నాకు దిగారు. 151 నోటీసు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. పోలీసులు పర్మిషన్ ఇచ్చారు.అయినా 6 గంటలపాటు విశాఖ ఎయిర్ పోర్టులో మా నాయకుడిని ఎందుకు అడ్డుకున్నారో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తెలియజేయాలని అన్నారు. చట్టాలు ..రాజ్యాంగం జగన్మోహన్ రెడ్డి ని చూసి సిగ్గుపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి కి గత ఎన్నికల్లో కోటి 50 వేలు ఓట్లు వస్తే .కోటి 40 వేలు వచ్చిన మా నాయకుడైన చంద్రబాబు నాయుడు ని అడ్డుకోవడం మీకు తగునా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నించారు. అన్ని పర్మిషన్ లు ఉన్నా. 151 నోటీసులు ఇచ్చినందుకు కోర్టు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి అకింతలు వేయడం ప్రజలు గమనిస్తున్నారు. 14 సంత్సరాలు ముఖ్యమంత్రి గా చేసిన వ్యక్తి నే మీరు ఇబ్బందులు పెడుతుంటే ఇక సామాన్య ప్రజలు పరిస్థితి ఏమిటి అని వైస్సార్ ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు.