YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గోపాలమిత్రకు కేంద్రం ఇస్తున్న నిధులు ఇవ్వడం లేదు: కన్నా

గోపాలమిత్రకు కేంద్రం ఇస్తున్న నిధులు ఇవ్వడం లేదు: కన్నా

గోపాలమిత్రకు కేంద్రం ఇస్తున్న నిధులు ఇవ్వడం లేదు: కన్నా
విజయవాడ మార్చ్ 2 
: ధాన్యం సేకరించిన రైతులు బకాయిలతో ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. గోపాల మిత్ర బృందాలకు ఇచ్చిన నిధులు 90% కేంద్రం  సబ్సిడీతో షెడ్లు వేసుకునేందుకు ఇస్తోందని... అయితే గోపాలమిత్రకు కేంద్రం ఇస్తున్న సొమ్ములు వారికి ఇవ్వడం లేదని కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. . సోమవారం  గవర్నర్‌ను బీజేపీ నేతలు కలిశారు. అనంతరం కన్నా మీడియాతో మాట్లాడుతూజగన్ ప్రభుత్వం వచ్చాక హిందూ ధర్మాన్ని పక్కన పెట్టేశారని విమర్శించారు మూడు విషయాలపై గవర్నర్‌ను కలిసినట్లు తెలిపారు. నెల్లూరు, పిఠాపురం దేవాలయాల్లో జరిగిన ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ దాడులపై చాలా సామాన్యంగా కేసులు రిజిస్టర్ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అండతోనే మతిస్థిమితం లేని వ్యక్తుల‌ దాడి అని కేసులు నమోదు అవుతున్నాయని దుయ్యబట్టారు. 2018 తరువాత హిందూ దేవాలయాల మీద దాడులు  పెరిగిపోయాయన్నారు. 

Related Posts