యూజ్ అండ్ త్రో మనస్థత్వం
తిరుమల మార్చ్ 2
మాజీ యం.పి బిజేపి నేత వివేక్ వెంకట స్వామి సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి మనవడి పుట్టువెంట్రుకలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నామని అన్నారు. ఈ సందర్బంగా అయన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, జగన్ మోహన్ రెడ్డిల మైత్రిపై సంచలన వ్యాఖ్యాలు చేసారు. జగన్ కేసిఅర్ మంచి మిత్రులు అనుకుంటారు చాలా మంది. కానీ ఒక్క విషయం జగన్ గుర్తుపెట్టుకోవాలి. కేసిఆర్ కు మిత్రులు ఎవరూ ఉండరు. అందరిని వాడుకుని సందర్బాన్ని బట్టి ఉపయోగించుకుంటారని అయన అన్నారు. కమిషన్ల కోసమే ఇరిగేషన్ ప్రాజెక్టులు, లింకు ప్రాజెక్టులు కడుతున్నారని అయన ఆరోపించారు. కేసీఆర్ విధానాన్ని గుర్తెరిగి మసలు కుంటే జగన్ కే మంచిదని హితవు పలికారు