YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

.ఢిల్లీలోనూ కరోనా కేసులు

.ఢిల్లీలోనూ కరోనా కేసులు

.ఢిల్లీలోనూ కరోనా కేసులు
న్యూఢిల్లీ, మార్చ్ 2
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ భారత్‌లో మరోసారి అడుగుపెట్టింది. సోమవారం దేశంలో రెండు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఒక వ్యక్తికి కరోనా సోకినట్టుగా గుర్తించగా.. హైదరాబాద్ నగరంలో మరో వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. ఇటలీ నుంచి ఢిల్లీ వచ్చిన వ్యక్తి కోవిడ్ బారిన పడ్డట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన మరో వ్యక్తికి కూడా కరోనా సోకిందని తెలిపింది.ఈ ఇద్దరిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరి ప్రయాణానానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ మాట్లాడుతూ.. ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా దేశాల పర్యటనలను వాయిదా వేసుకోవాలని ప్రజలకు సూచించారు. 21 ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాల్లో స్క్రీనింగ్ చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. 12 దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించామన్నారు.భారత్‌లో తొలి కరోనా వైరస్ కేసు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. వుహాన్ నుంచి కేరళ తిరిగొచ్చిన ముగ్గురికి కరోనా సోకగా.. వీరిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించారు. దీంతో వీరు ముగ్గురూ కోలుకున్నారు. అలాగే చైనా నుంచి తీసుకొచ్చిన భారతీయులను పనేసర్‌లోని క్వారంటైన్ సెంటర్లలో ఉంచి 14 రోజులపాటు అబ్జర్వేషన్లో ఉంచారు. ఇటీవలే చైనా నుంచి తీసుకొచ్చిన వారిని చావ్లాలోని ఐటీబీపీ కేంద్రంలో క్వారంటైన్లో ఉంచారు.ఆదివారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 3 వేలు దాటింది. చైనాలోనే ఎక్కువ మరణాలు సంభవించగా.. ఇరాన్, ఇటలీ, దక్షిణ కొరియాల్లోనూ కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ వైరస్ 64 దేశాలకు పాకింది.

Related Posts