YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సోషల్ మీడియాకు మోడీ గుడ్ బై

సోషల్ మీడియాకు మోడీ గుడ్ బై

 సోషల్ మీడియాకు మోడీ గుడ్ బై
న్యూఢిల్లీ, మార్చి 3, 
సోషల్ మీడియా నుంచి వైదొలగాలని యోచిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సోషల్ మీడియా వేదికలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూట్యూబ్ నుంచి ఈ ఆదివారం నుంచే తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తాను లేకపోయినా అందరూ చురుగ్గా పోస్టింగ్‌లు చేయాలని సూచించారు.సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోయింగ్ నాయకుల్లో ప్రపంచంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ముందు వరుసలో ఉన్నారు. ట్విట్టర్‌లో ఆయనకు 5.33 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 3 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ పేజీని 4.4 కోట్ల మంది లైక్ చేశారు.అయితే ఉన్నట్లుండి ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారో తెలిసిరాలేదు. అయితే సోషల్ మీడియా నుంచి వైదొలుగుతానని ప్రధాని చేసిన ట్వీట్‌కు భారీ రెస్సాన్స్ వస్తోంది. ఆ ట్వీట్‌ను ఇప్పటి వరకు 35 వేల మంది లైక్ చేయగా, 12 వేల మంది రీ ట్వీట్ చేశారు.

Related Posts