జగన్ పై దుష్ఫచారం
విజయవాడ మార్చి 3
ఈ ప్రభుత్వం ప్రజల కొరకు పాటు పడుతుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి పనిచేస్తుంది. గత ప్రభుత్వం 44 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చింది కానీ ఈ ప్రభుత్వం 60 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఉదయం అయన 26వ డివిజన్ లో పర్యటించారు. మంత్రి మాట్లాడుతూ టీడీపీ హాయంలో కేవలం 1000 రూపాయలు ఇచ్చారు. జగన్ హయాంలో దశల వారిగా పెన్షన్ పెంచుకుంటూ అర్హులైన వారికి పెన్షన్ అందిస్తున్నాం. జగన్ సంక్షేమ పథకాలను నేరుగా ఇవ్వాలని తలిచారు.. వారందరికీ అన్ని అందుతున్నాయి లేదా అని ప్రజలతో మాట్లాడామని అన్నారు. రాష్ట్రంలోని దేవాలయాలు కూల్చి వేస్తున్నారు అంటున్న కన్నా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. డిపాజిట్లు కూడా రాని కన్నా మత రాజకీయం చేస్తున్నారు. టీడీపీ, పవన్, కన్నా ముగ్గురు ఒకటే. బీజేపీ,టీడీపీ హయాంలో 45 దేవాలయాలు,విగ్రహాలను ధ్వంసం చేశారు. అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు ఎం మాట్లాడలేదని అయన ప్రశ్నించారు. కావాలని హిందూ మతంపై బురద చల్లెవిధంగా, జగన్ కి ఒక మతానికే కొమ్ము కాస్తున్నారు అని ఫిక్స్ చేయడానికి దుష్ప్రచారం చేస్తున్నారు. కౌన్సిల్ లో నేను లోకేష్ కి సవాల్ విసిరాను. మీరు చేసే ఆరోపణలు నిజం అని నిరుపిస్తే నేను నా పదవి నుంచి తప్పుకుంటాను.. నీ పదవి నుంచి తప్పకుంటావా అని ప్రశ్నిస్తే లోకేష్ పారిపోయారని మంత్రి విమర్శించారు.